దేవుడికి టెంకాయ ఎందుకు కొట్టాలి?

పరంధాముడికి మనం ఇచ్చే నివేదన పవిత్రంగా వుండాలి. నిరంతరం మనల్ని రక్షించే భగవంతుడికి నిండైన మనస్సుతో ప్రార్థన చేయడం ఆ స్వామికి మనం చేసే సేవ. దేవునికి ప్రథమంగా టెంకాయనే నివేదనగా ఇస్తుంటారు. టెంకాయలోని నీరు పవిత్రమైనవి. ఎలాంటి కలుషితం లేకుండా తయారవుతాయి. వీటిలో ఎలాంటి కల్తీవుండదు. టెంకాయ పైభాగం పీచుగా, పెంకు గట్టిగా, లోపల తెల్లటి కొబ్బరి, నీళ్లు వుంటాయి. మనలోని అహాన్ని నిర్మూలించేందుకు టెంకాయను కొట్టాలని పెద్దలు చెబుతారు. ఇదే కాకుండా విఘ్ననాధుడైన వినాయకుడికి తొలి వందనంచేస్తాం. ఆయనకు ఇష్టమైన పదార్థాలను టెంకాయతోనే తయారుచేస్తారు. అందుకు ఆ స్వామికి ఇష్టానుగ్రహం కోసం టెంకాయను సమర్పిస్తాం. టెంకాయకు వున్న మూడుకళ్లు సాక్షాత్తు ఆ త్రినేత్రుడి నేత్రాలని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే టెంకాయను మొదటగా దేవుడికి, ఏదైనా శుభకార్యం ముందు కొడుతుంటాం.